Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ గడ్డపై ఐపీఎల్ 2020 టోర్నీ?

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (15:57 IST)
స్వదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ వైరస్ కారణంగా అనేక క్రీడా పోటీలను వాయిదావేయడం జరిగింది. అలాంటి వాటిలో కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. వాస్తవానికి ఈ టోర్నీ మార్చి నెలాఖరులో ప్రారంభమై మే నెలలో ముగియాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. ఇపుడు కూడా దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఈ టోర్నీని విదేశీ గడ్డపై నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కరోనా వైరస్‌ అదుపులోకి వస్తే దేశంలోనే లీగ్‌ను నిర్వహించడానికే తొలి ప్రాధాన్యమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సాధ్యం కాని పక్షంలో యూఏఈ లేదా లంకకు తరలించే అవకాశం ఉందన్నారు. 'వేదికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశంలో పరిస్థితులు ఇప్పుడైతే అనుకూలంగా లేవు. విదేశాలకు తరలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యూఏఈ లేదా లంకలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారు' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటే వేదిక గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ తీవ్రత తగ్గకపోతే విదేశాలకు తరలించడం తప్ప మరో దారిలేదు. ప్రేక్షకులను అనుమతించక పోతే ఎక్కడైతే ఏంటి అని ఆయన ప్రశ్నించారు. మొత్తంమీద టోర్నీ నిర్వహణపై వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments