Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌కు చుక్కలు చూపించిన ముంబై.. బౌలర్లు గెలిపించారు..

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (11:37 IST)
కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది . పంజాబ్​​ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలమయ్యారు. నికోలస్​ పూరన్​(44) టాప్​ స్కోరర్​. మయాంక్​(25), గౌతమ్​(22) పరుగులు చేశారు. బుమ్రా, చాహర్​, ప్యాటిన్సన్​ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై 20 ఓవర్లకు 191/4 పరుగులు చేసింది. రోహిత్​(70) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో పొలార్డ్​(47*), హార్దిక్​ పాండ్యా(30) చెలరేగి ఆడారు. షమీ, గౌతమ్​, కాట్రెల్​ తలో వికెట్​ తీశారు.
 
ముంబై ఇండియన్స్​ లెగ్​ స్పిన్నర్​ క్రునాల్​ పాండ్యా వేసిన బంతికి కరుణ్​ నాయర్​(0) డకౌట్​గా వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజ్​లో కేఎల్​ రాహుల్​, పూరన్​లు ఉన్నారు.
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ను ముంబై బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఫామ్‌లో ఉన్న మాయంక్‌ అగర్వాల్‌(25), కేఎల్‌ రాహుల్‌(17)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ఒక్క నికోలస్‌ పూరన్ ‌(44; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించాడు. 
 
చివర్లో గౌతమ్‌(22 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులే మాత్రమే చేసి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
 
ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బౌల్ట్‌, కృనాల్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు. ఇదిలావుంటే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

తర్వాతి కథనం
Show comments