Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (10:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పంట పండిస్తున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చివరి వరకు పోరాడింది. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మెట్‌లో ధోనీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడు సిక్సర్లు బాదాడు. ధోనీ ఐపీఎల్‌లో మొత్తం 203 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (203 సిక్సర్లు) మూడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(323 సిక్సర్లు), ఏబీ డీ విల్లియర్స్(204) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments