Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (10:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పంట పండిస్తున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చివరి వరకు పోరాడింది. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మెట్‌లో ధోనీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడు సిక్సర్లు బాదాడు. ధోనీ ఐపీఎల్‌లో మొత్తం 203 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (203 సిక్సర్లు) మూడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(323 సిక్సర్లు), ఏబీ డీ విల్లియర్స్(204) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments