Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (10:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పంట పండిస్తున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చివరి వరకు పోరాడింది. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మెట్‌లో ధోనీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడు సిక్సర్లు బాదాడు. ధోనీ ఐపీఎల్‌లో మొత్తం 203 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (203 సిక్సర్లు) మూడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(323 సిక్సర్లు), ఏబీ డీ విల్లియర్స్(204) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments