Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది : అనురాగ్ ఠాగూర్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (16:51 IST)
వచ్చే 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సహా మిగిలిన అన్ని జట్లూ పాల్గొంటాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. అయితే, పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ను తటస్థ వేదికపై ఆడుతామంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 
 
వీటిపై అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో సహా అన్ని పెద్ద జట్లూ పాల్గొంటాయని స్పష్టం చేశారు. 'వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించే బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. 
 
అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు' అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఇంటి వద్దకే ఫించన్.. భారతదేశంలో ఇదే తొలిసారి.. చంద్రబాబు అదుర్స్

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం

హైదరాబాద్ రెస్టారెంట్‌ బిర్యానీలో స్లైడ్ పిన్.. నెట్టింట ఫోటో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments