Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది : అనురాగ్ ఠాగూర్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (16:51 IST)
వచ్చే 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సహా మిగిలిన అన్ని జట్లూ పాల్గొంటాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. అయితే, పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ను తటస్థ వేదికపై ఆడుతామంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 
 
వీటిపై అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో సహా అన్ని పెద్ద జట్లూ పాల్గొంటాయని స్పష్టం చేశారు. 'వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించే బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. 
 
అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు' అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

తర్వాతి కథనం
Show comments