జయహో భారత్ : న్యూజిలాండ్‌ చిత్తు.. పదేళ్ళ తర్వాత వన్డే సిరీస్

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (15:00 IST)
విదేశీ గడ్డపై భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించి కంగారులను కంగారెత్తించిన కోహ్లీ సేన.. ఇపుడు న్యూజిలాండ్‌లోనూ ఇదే జోరును కొనసాగిస్తోంది. ఫలితంగా పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై భారత జట్టు వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. 
 
కాగా, సోమవారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
భారత జట్టు ఓపెనర్లలో రోహిత్ శర్మ 62, శిఖర్ ధావన్ 28, విరాట్ కోహ్లీ 60, అంబటి రాయుడు 40, దినేష్ కార్తీక్ 38 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, కుమార్ 2, చాహల్ 2, పాండ్యా 2 చొప్పున వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments