Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ టెస్టు : భారత్ విజయభేరీ.. ఇన్నింగ్స్ తేడాతో విండీస్ ఓటమి

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (15:08 IST)
రాజ్‌కోట్ వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.
 
ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత జట్టులో ఓపెనర్ పృథ్వీ షా (134), కెప్టెన్ విరాట్ కోహ్లీ (139), రవీంద్ర జడేజా (100 నాటౌట్)లు సెంచరీలతో కదం తొక్కగా రిషబ్ పంత్ 92, పుజారా 86 పరుగులతో రాణించాడు. 
 
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు 181 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 468 పరుగులు వెనుకబడి వెస్టిండీస్ ఫాలో ఆన్ మొదలుపెట్టింది. ఈ రెండో ఇన్నింగ్స్‌లో కూడా వెస్టిండీస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ జట్టులో పావెల్ మాత్రమే అత్యధికంగా 83 పరుగులు చేసింది. 
 
భారత స్పిన్నర్లు కుల్దీప్ ఐదు వికెట్లతో విండిస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీసుకోవడంతో పాలో ఆన్ ఇన్నింగ్స్‌లో విండిస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 272 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments