Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ టెస్ట్ : ధీటుగా బదులిచ్చిన లంకేయులు... 356/9

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:26 IST)
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది. భార‌త్ కంటే ఇంకా 180 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 131/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక‌ను మ‌థ్యూస్ (111), చండీమాల్ (147-నాటౌట్) ఆదుకున్నారు. 
 
మ‌థ్యూస్ ఔటైన త‌ర్వాత లాస్ట్ సెష‌న్‌లో శ్రీలంక వికెట్లు వెంటవెంటనే లాస్ట్ 15 ఓవ‌ర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే బ్యాడ్ లైట్ కార‌ణంగా 5 ఓవ‌ర్లు ముందే మ్యాచ్‌ను ముగించ‌డంతో శ్రీలంక ఆలౌట్ నుంచి త‌ప్పించుకుంది. భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ష‌మీ, ఇశాంత్, జ‌డేజా తలా 2 వికెట్లు తీసుకున్నారు.  
 
అంతకుముందు, భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌‌ను 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, సొంతగడ్డపై ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఏకంగా 234 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఇది కోహ్లీకి ఆరో డబుల్ సెంచరీ. దీంతో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వం కాదు..

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments