Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీల వెన్నువిరిచిన భారత బౌలర్లు.. ఫాలోఆన్‌కు ఆహ్వానం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:02 IST)
రాంచి వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా సఫారీలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో పాటు.. రహానె సెంచరీ, ఉమేష్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వచ్చిన 31 పరుగులు ఉన్నాయి. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎల్గర్‌ (0), డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔట్ కాగా, హంజా గరిష్టంగా 62 పరుగులు చేశాడు. 
 
అలాగే, బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కొహ్లీ సేన ఫాలో‌ఆన్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments