సఫారీల వెన్నువిరిచిన భారత బౌలర్లు.. ఫాలోఆన్‌కు ఆహ్వానం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:02 IST)
రాంచి వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా సఫారీలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో పాటు.. రహానె సెంచరీ, ఉమేష్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వచ్చిన 31 పరుగులు ఉన్నాయి. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎల్గర్‌ (0), డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔట్ కాగా, హంజా గరిష్టంగా 62 పరుగులు చేశాడు. 
 
అలాగే, బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కొహ్లీ సేన ఫాలో‌ఆన్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments