Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్ : కోహ్లీ పోరాటం.. భారత్ 223 ఆలౌట్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (21:31 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో కేప్‌‍టౌన్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచితంగా ఒంటరిపోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. 
 
అయితే, మరోమారు ఔట్ సైడ్ ఎడ్జ్‌తో రబాడ  బౌలింగ్‌లో వెవిలియన్‌కు చేరాడు. అలాగే, మిగిలిన భారత ఆటగాళ్లలో పుజార్ 43, రిషబ్ పంత్ 27 మినహా ఇతరులెవ్వరూ రాణించలేదు. ఫలితంగా భారత్ 223 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా, మాక్రో జాన్సన్ మూడు వికెట్లు తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనర్లు రాహుల్ 12, అగర్వాల్‌ 15 చొప్పున పరుగులు చేసి స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, కోహ్లీ జోడీ కాసేపు క్రీజ్‌లో నిలబడి సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

Kerala: టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుంచి లాక్కున్న ఏనుగు (video)

పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు : సైఫుల్లా కసూరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

తర్వాతి కథనం
Show comments