Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ వన్డేలో ధోనీ రికార్డుల మోత.. సెంచరీని ఎందుకు మిస్ చేసుకున్నాడో తెలుసా?

మొహాలీలో కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:05 IST)
మొహాలీలో కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన ధోనీ.. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేగాక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన కెప్టెన్గా మరో ఘనత సాధించాడు.
 
దీంతో కివీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ అద్భుత ఆటతీరుతో జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ధోనీ, కోహ్లీ కలిసి అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 80 వ్యక్తిగత స్కోర్ వద్ద ధోనీ ఔటయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
సెంచరీకి 20 పరుగుల దూరంలో ధోనీ ఔట్ కావడంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ అనంతరం ధోనీ సెంచరీ మిస్‌ గురించి ఏమన్నాడంటే..? క్రీజులో స్వేచ్ఛగా ఆడటంతో కొంతవరకూ శక్తిని కోల్పోయానని చెప్పాడు. ఆ టెన్షన్‌లో అవుట్ అయ్యానని వివరణ ఇచ్చాడు. సెంచరీ సంగతిని పక్కనబెట్టి జట్టు విజయానికి కావాల్సిన పరుగులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని ధోనీ కొనియాడాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments