Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ మూడో టెస్టు.. పుజారా అదుర్స్.. రెండోసారి డిక్లేర్ చేసిన భారత్

ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి,

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (15:25 IST)
ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి, 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 101(నాటౌట్) పరుగులతో సెంచరీతో అదర గొట్టాడు. 
 
అలాగే గంభీర్ మెరుగ్గా రాణించి హాఫ్ సెంచరీ సాధించాడు. విజయ్ 19, కోహ్లీ 17, రహానే 23(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ప్రత్యర్ధి జట్టు ముందు 475 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది కోహ్లీ సేన. సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. మరో 120 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్‌కు విజయం ఖాయమని క్రీడా పండితులు అంటున్నారు. 
 
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 557/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299/10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 216/3 డిక్లేర్డ్ చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments