కివీస్‌తో రెండో వన్డే.. 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (15:49 IST)
న్యూజిలాండ్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మౌంట్ మాంగనుయ్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 325 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 40.2 ఓవర్లలోనే 234 పరుగులకు కివీస్ ఆలౌటైంది. 
 
భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తాచాటి.. నాలుగు వికెట్లతో కివీస్ వెన్నువిరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్ 22 పరుగులు చేశారు. 
 
కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో  బ్రేస్ వెల్ మాత్రమే 57 పరుగులు చేసి భారత బౌలింగును ధీటుగా ఎదుర్కొన్నాడు.
 
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువనేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయంలో కీలకపాత్రను పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

తర్వాతి కథనం
Show comments