Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 ఓవర్లలోనే ఇంగ్లండ్ భరతం పట్టిన భారత బౌలర్లు... కోహ్లీ సేన ఘన విజయం

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు విజయభేరీ మోగించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫలితంగా ఇం

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:17 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు విజయభేరీ మోగించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు చిత్తుకాగా, మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.
 
ఐదోరోజైన బుధవారం రోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 317 పరుగుల దగ్గర చివరి వికెట్ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 
 
ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లి సేన. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5, ఇషాంత్ 2, షమి, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు విరాట్ కోహ్లీకి ద‌క్కింది. సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. 
 
ఈ గెలుపుతో తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమిపాలైన భారత్.. మూడో టెస్టులో మాత్రం ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో హార్డిక్‌ పాండ్యా ఆతిథ్య జట్టు నడ్డి విరవగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను బుమ్రా తన భుజానికెత్తుకున్నాడు. 521 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్‌, గంట తిరిగే సరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కుక్‌, రూట్‌లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్‌లు ఔటైపోవడంతో తొలి రెండు సెషన్లలోపే ఆట ముగిసిపోతుందనుకున్నారు.
 
కానీ, బట్లర్‌, స్టోక్స్‌ జోడీ భారత్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆపై బుమ్రా మ్యాజిక్ కొనసాగింది. టపటపా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను పతనం అంచుకు చేర్చాడు. దీంతో నాలుగో రోజే భారత్‌ విజయంతో ఆట ముగిస్తుందని అభిమానులు ఆశించినా, 9 వికెట్లు మాత్రమే పడ్డాయి. విజయానికి భారత్ ఒక వికెట్‌ దూరంలో నిలిచింది.
 
సంక్షిప్తంగా స్కోర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌-329
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌-161
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌-352/7
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌-317 
మ్యాచ్ ఫలితం : 203 రన్స్ తేడాతో భారత్ గెలుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments