Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత... మోతేరా టెస్ట్‌కు అరుదైన ఘనత

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (15:21 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మోతేరా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఇందులో భారత్ పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
అయితే, ఈ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత ఒకటి లభించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అతి తక్కువ సమయంలో ఫలితం తేలిన టెస్టుగా చరిత్రపుటలకెక్కింది. మూడో టెస్టు ఫలితం తేలడానికి కేవలం నాలుగు సెషన్ల సమయం మాత్రమే పట్టింది.
 
రెండు రోజుల లోపలే ఇండియా ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది. తద్వారా, రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) తర్వాత పూర్తి చేసిన షార్ట్ టైమ్ టెస్టుగా నిలిచింది. 1946లో వెల్లింగ్టన్లో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో 145.2 ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది. 
 
కానీ, మోతేరా స్టేడియంలో కేవలం 140.2  ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. తాజా టెస్టులో రెండో రోజు మొత్తం 17 వికెట్లు నేలకూలాయి. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోని వికెట్లను తీశారు. అక్సర్‌కు ఐదు వికెట్లు పడగా, అశ్విన్ నాలుగు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments