Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోర్ 288/5.. 30 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టిన అశ్విన్

భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఆల్‌రౌండర్ అశ్విని బౌలింగ్‌లో అదరగొట్టాడు. తొలుత టా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (17:36 IST)
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఆల్‌రౌండర్ అశ్విని బౌలింగ్‌లో అదరగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత బౌలర్లు బ్రిటీష్ ఆటగాళ్లకు చుక్కలు చూపేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ ఓపెనర్లు కెప్టెన్ కుక్ (46), జెన్నింగ్స్ (112) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శుభారంభం చేశారు. 
 
ఫలితంగా ఇంగ్లండ్ భారీ స్కోరు చేస్తుందని అనుకునేలోపే జడేజా సంధించిన అద్భుతమైన బంతికి కుక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రూట్ (21) కుదురుకున్నట్టే కనిపించినా అశ్విన్ మాయాజాలానికి బోల్తా కొట్టాడు. ఆపై బరిలోకి దిగిన మొయిన్ అలీ (50) జెన్నింగ్స్‌తో కలిసి కుదురుకున్నాడు. అర్ధసెంచరీ సాధించి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. కానీ స్వీప్ షాట్‌తో కరుణ్ నాయర్ వికెట్‌కు పెవిలియన్ చేరాడు.
 
అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్స్‌కు గుడ్ లెంగ్త్ బంతిని సంధించిన అశ్విన్ ఫలితం రాబట్టాడు. పుజారా చక్కని క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం బెయిర్ స్టో (2)కు అశ్విన్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ (25), జోస్ బట్లర్ (18) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 94 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో 30 ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జడేజా, ఒక వికెట్ సాధించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments