Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ ట్వంటీ20 : భారత్ స్కోరు 124/7 :: ఇంగ్లండ్ టార్గెట్ 125 రన్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:48 IST)
స్వదేశంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించింది. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)లు ఇటొచ్చి అటెళ్లిపోయారు. ఫలితంగా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఆ తర్వాత రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
అయితే, జట్టు స్కోరు 48 పరుగుల వద్ద ఉండగా, రిషబ్ పంత్ (21) స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా 19 పరుగుల వద్ద ఔట్ కాగా, శార్దూల్ ఠాగూర్ డకౌట్ అయ్యాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ మాత్రం రాణించి 48 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 67 పరుగులు చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్ 7 చొప్పున పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముంగిట 125 రన్స్ విజయలక్ష్యంగా నిర్ధేశించింది. 
 
ఇదిలావుంటే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు మోతేరా స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే, గుజరాత్‍‌‌లో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ భారీ స్టేడియంలో 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. మార్చి 12న ప్రారంభమైన ఈ టీ20 సిరీస్ ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది. 
 
దీనిపై గుజరాత్ క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు ధన్ రాజ్ నత్వాని స్పందిస్తూ... స్టేడియం సామర్థ్యంలో సగం మాత్రమే నిండేలా టికెట్ల అమ్మకం చేపడుతున్నట్టు తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌‍లైన్‌లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల వివరాలు... 
 
ఇండియా: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్.
 
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), మలాన్, బెయిర్ స్టో, మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, రషీద్, మార్క్ వుడ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments