Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్‌లో మయాంక్ మాయాజాలం : డబుల్ సెంచరీ... భారత్ భారీ స్కోరు

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:13 IST)
ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. జట్టులోని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోమారు బ్యాట్‌తో రాణించాడు. తన టెస్ట్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. మొత్తం 330 బంతుల్లో 28 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 105 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా (54) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 86 పరుగులు చేసిన అంజిక్య రహానే సెంచరీ ముంగిట బోల్తాపడ్డాడు. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లూ అబు జాయెద్‌కే దక్కడం గమనార్హం. 
 
అంతకుముందు బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఇందులో మయాంక్ అగర్వాల్ 243 పరుగులు చేయగా, పుజారా 54, రహానే 86, జడేజా 60 (నాటౌట్), షా 12, యాదవ్ 25 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అబు జాయేద్‌కు 4 వికెట్లు, హోస్సైన్, హాసన్ మీరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంతో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

తర్వాతి కథనం
Show comments