Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్‌లో మయాంక్ మాయాజాలం : డబుల్ సెంచరీ... భారత్ భారీ స్కోరు

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:13 IST)
ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. జట్టులోని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోమారు బ్యాట్‌తో రాణించాడు. తన టెస్ట్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. మొత్తం 330 బంతుల్లో 28 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 105 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా (54) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 86 పరుగులు చేసిన అంజిక్య రహానే సెంచరీ ముంగిట బోల్తాపడ్డాడు. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లూ అబు జాయెద్‌కే దక్కడం గమనార్హం. 
 
అంతకుముందు బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఇందులో మయాంక్ అగర్వాల్ 243 పరుగులు చేయగా, పుజారా 54, రహానే 86, జడేజా 60 (నాటౌట్), షా 12, యాదవ్ 25 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అబు జాయేద్‌కు 4 వికెట్లు, హోస్సైన్, హాసన్ మీరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంతో ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments