Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి ఏకాగ్రత లేదు.. నెగటివ్ ఆలోచనలు ఏర్పడ్డాయి: మార్క్ వా

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్ర

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (13:08 IST)
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చెప్పాడు. ఇందుకు కారణం ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరొందిన భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడమేనని చెప్పారు. 
 
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శనతో కేవలం 12 పరుగులకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అంపైర్‌ను రివ్యూ కోరడం.. అందులో కోహ్లి ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించడంతో కోహ్లి చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. అద్భుతమైన ఆటగాడిగా కోహ్లి ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి కూడా ఎల్‌డబ్లును అంచనా వేయలేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని అభిప్రాయపడ్డాడు. వరుస ఇన్నింగ్స్‌లలో విఫలం వస్తు ఉండటంతో కోహ్లిలో నెగటివ్ ఆలోచనలు ఏర్పడి ఏకాగ్రత కోల్పోవడానికి దారితీస్తుందని మార్క్ వా విమర్శించాడు.
 
అద్భుతాలు చేస్తాడనకుంటే విరాట్ పేలవ ప్రదర్శనతో అనవసర తప్పిదాలతో వికెట్ కోల్పోతూ వస్తున్నాడని మార్క్ వా ఎద్దేవా చేశాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన సారథి మధ్యలోనే నిష్క్రమిస్తే.. టీమ్‌లోని మిగతా సభ్యులపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పాడు.

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments