Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్ట్ : కంగారెత్తించిన భారత బౌలర్లు .. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:05 IST)
బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సోమవారం మూడో రోజు ఆట ముగిసింది. ఈ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. 
 
రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆసీస్ ప్రస్తుతం రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 195 పరుగలకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
 
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ 0,  శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17, హనుమ విహారి 21, రిషబ్ పంత్ 29, అజింక్యా రహానె 112, రవీంద్ర జడేజా 57, రవిచంద్రన్ అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. 
 
అలాగే, ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ ఆటగాళ్లు కంగారెత్తిపోయారు. ఫలితంగా క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. ఓపెనర్లలో బర్న్స్ 4, వాడే 40 పరుగులు చేయగా, లుబ్సజ్ఞే 28, స్మిత్ 8, హెడ్ 17, గ్రీన్ 17 (నాటౌట్), పైనే 1, కమ్మిన్స్ 15 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో జడేజాకు రెండు, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్‌కు తలో వికెట్ దక్కాయి. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments