Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండరో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత్

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (15:21 IST)
ఇండోర్ వేదికగా జరిగిన ముడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా విసిరిన స్పిన్ వలో చిక్కుకుని ఓటమి పాలైంది. ఫలితంగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా భారత్ ఆధిక్యాన్ని 2-0 నుంచి 2-1కు తగ్గించింది. 
 
తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో స్పిన్ అస్త్రంతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన భారత్ ఇపుడు అదే స్పిన్ అస్త్రంలో చిక్కుకుంది. ఫలితంగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 76 పరుగుల విజయలక్ష్యాన్ని మూడో రోజు శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.
 
ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేసి భారత ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రెండో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకు ఆలౌట్ అవగా.. అంతకుముందు ఆస్ట్రేలియా 197 స్కోరు చేసి 88 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 163 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థికి చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments