మూడో వన్డే మ్యాచ్ : ఆస్ట్రేలియా భారీ స్కోరు - భారత్ టార్గెట్ 353 రన్స్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (17:31 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 353 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో కంగారులు ఉన్నారు. ఫలితంగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 
 
డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్‌లు తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ 74, మార్నస్ 72, క్యారీ అలెక్స్ క్యారీ 11, కుమ్మిన్స్ 19 చొప్పున పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టీమిండియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్ష్ అవుటయ్యాడు. వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు.
 
వన్ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు కాగా... 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

తర్వాతి కథనం
Show comments