Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:49 IST)
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో భారత్ నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని ఓపెనర్లిద్దరే ఛేదించారు. ఈ విజయంతో ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 10, శిఖర్ ధావన్ 74, రాహుల్ 47, కోహ్లీ 16, అయ్యర్ 4, పంత్ 28, జడేజా 25, ఠాకూర్ 13, షమి 10, కుల్దీప్ యాదవ్ 17 చొప్పున పరుగులు చేయగా అదనపు పరుగుల రూపంలో 11 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 110 (నాటౌట్), డేవిడ్ వార్నర్ 128 (నాటౌట్)లతో సెంచరీలు మోత మోగించారు. ఫలితంగా భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు నిస్తేజంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 17న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

తర్వాతి కథనం
Show comments