Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వీంటీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు వెల్లడి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (20:26 IST)
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు నెలలో ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్ కోసం జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. వైఎస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, గాయాల కారణంగా జట్టుకు దూరమైన డెత్ ఓవర్ల స్పెషలిస్టులు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను కూడా జట్టులోకి తీసుకున్నారు. అలాగే, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచి జట్టులో చోటు కల్పించారు. అలాగే, దినేష్ కార్తీక్‌కు కూడా అవకాశం ఇచ్చారు. 
 
మరో పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు స్థానం చోటు కల్పించలేదు. కానీ, చాహర్, షమీలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా అవకాశం కల్పించారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు కూడా స్టాండ్‌బై ఆటగాళ్ళుగా తీసుకున్నారు. 
 
జట్టు వివరాలు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పటేల్, దీపక్ హుడా, అశ్విన్ చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments