Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరాతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (14:50 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి క్రీడా నగరంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసో సియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం 60 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 
 
దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల నీటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్ నగరంలో ఉంది. దానికి మించి 125 లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తున్నాం. బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించాం. కొంత స్థానికంగా మేము సమీకరిస్తాం. అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులోనే ఈ స్టేడియం వస్తుంది అని ఆయన చెప్పారు. 
 
ఇక అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. వీటి నిర్వహణకు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్‌ను తీసుకుంటున్నామని, వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 16 మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NEET: నీట్‌లో 99.99 శాతం.. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

Dantewada: దంతెవాడ 71మంది నక్సలైట్లు లొంగిపోయారు

రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం కేబినెట్

Chandra Babu: అమరావతిలో బ్యాంకులను ఏర్పాటు చేయండి.. చంద్రబాబు

దొంగబాబా.. ఢిల్లీలో మహిళా విద్యార్థులపై లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

Sreeleela: మాస్ జాతర చిత్ర విడుదలతేదీని ప్రకటించిన నిర్మాత నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments