Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ మృతి.. గదిలో విగతజీవిగా..

భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (17:13 IST)
భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ ముంబైలోని ఓ లాడ్జి గదిలో ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల బీసీసీఐ తరపున సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. 
 
రాజేష్ సావంత్ కనిపించకపోయేసరికి వెతకగా.. తన రూమ్‌లో నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆయన గుండెపోటుతో మరణించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసులు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
భారత్ అండర్ 19 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగాలి. చివరి మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 8న జరుగుతుంది. సావంత్ ఆఫ్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు, భారత్ ఏ జట్టు ట్రైనర్‌గా కూడా పని చేశారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments