ఇంతవరకు జరిగిన ఆరు ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లలో జైత్రయాత్ర సాగిస్తూ వచ్చిన భారత్ మెల్బోర్న్ వేదికగా గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు.
తొలి పది ఓవర్లలో భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 24, శిఖర్ ధావన్ 21 పరుగులు చేయగా, ఎక్స్ట్రాల రూపంలో ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ తొలి బంతిని బౌండరీకి తరలించిన రోహిత్.. ఆ తర్వాత నాలుగు ఫోర్లు కొట్టగా, శిఖర్ ధావన్ మూడు ఫోర్లు కొట్టాడు.