Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ అంతిమపోరులో భారత్‌ను ఆపడం ఏ జట్టుకైనా అసాధ్యం : కేన్ విలియమ్సన్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (08:40 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 397 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టి, ప్రపంచ కప్‌ను మూడోసారి ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు భారత్ అని కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారన్నారని, ఫైనల్‌లో వారిని ఆపడం చాలా కష్టమని హెచ్చరించాడు. అదేసమయంలో టీమిండియాకు కేన్ అభినందలు తెలిపారు. 
 
భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డాడు. భారత్ ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభతరం కాదన్నారు. "సాధారణంగా వైఫల్యాలు ఎదరవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ, టీమిండాయ ఈ టోర్నీలో నిజంగానే అద్భుతంగా ఆడుతుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. రౌండ్ రాబిన్ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. సెమీ ఫైనల్‌లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కాగా, గత 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను కివీస్ జట్టు ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇపుడు దానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments