Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ అంతిమపోరులో భారత్‌ను ఆపడం ఏ జట్టుకైనా అసాధ్యం : కేన్ విలియమ్సన్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (08:40 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 397 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టి, ప్రపంచ కప్‌ను మూడోసారి ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు భారత్ అని కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారన్నారని, ఫైనల్‌లో వారిని ఆపడం చాలా కష్టమని హెచ్చరించాడు. అదేసమయంలో టీమిండియాకు కేన్ అభినందలు తెలిపారు. 
 
భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డాడు. భారత్ ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభతరం కాదన్నారు. "సాధారణంగా వైఫల్యాలు ఎదరవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ, టీమిండాయ ఈ టోర్నీలో నిజంగానే అద్భుతంగా ఆడుతుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. రౌండ్ రాబిన్ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. సెమీ ఫైనల్‌లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కాగా, గత 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను కివీస్ జట్టు ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇపుడు దానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments