Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకపై 82 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (08:21 IST)
Team India
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
 
ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, టీమిండియా రన్‌రేట్‌ (0.560) కూడా పెరిగింది. 
 
దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. 
 
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన శ్రీలంక ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 82 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
భారత మహిళా బౌలర్ల విషయానికొస్తే.. అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. ఇక శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్​ వికెట్ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments