Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో తొలి వన్డే: 67 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (22:44 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 373 పరుగులు చేసి శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (113) సెంచరీ సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 83, శుభ్ మాన్ గిల్ 70 పరుగులు చేశారు. 
 
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.  
 
శ్రీలంక ఆటగాళ్లలో నిశాంక 72, అసలంగ 23, సిల్వా 47, షనక 102, హజరంగ 16 పరుగులు సాధించారు. భారత జట్టు తరఫున స్యామీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ తీశారు. సిరాజ్ 2 వికెట్లు, మాలిక్ 3 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 12న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments