శ్రీలంకతో తొలి వన్డే: 67 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (22:44 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 373 పరుగులు చేసి శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (113) సెంచరీ సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 83, శుభ్ మాన్ గిల్ 70 పరుగులు చేశారు. 
 
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.  
 
శ్రీలంక ఆటగాళ్లలో నిశాంక 72, అసలంగ 23, సిల్వా 47, షనక 102, హజరంగ 16 పరుగులు సాధించారు. భారత జట్టు తరఫున స్యామీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ తీశారు. సిరాజ్ 2 వికెట్లు, మాలిక్ 3 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 12న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments