చివరి టీ20లో భారత్ ఓటమి... సౌతాఫ్రికాకు ఊరట

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (08:41 IST)
ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. టీమిండియా ఓటమితో సౌతాఫ్రికా జట్టు ఊరట చెందింది. మొత్తం మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి ఇండోర్ వేదికగా జరిగింది. ఇందులో రోహిత్ సేన 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా భారత జట్టు ఓటమిని చవిచూసింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రిలీ రుస్సో మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 48 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 7 ఫోర్ల సాయంత్రం 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఓపెనర్ డికాక్ కూడా 68, స్టబ్స్ 23, మిల్లర్ 19 పరుగులతో రాణించాడు. అదనంగా 14 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో చాహర్, ఉమేష్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భాత జట్టు 18.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో దినేష్ కార్తీక్ మాత్రమే అత్యధికంగా 46 పరుగులు చేయగా, దీపక్ చాహర్ 31, రిషబ్ పంత్ 27, ఉమేష్ యాదవ్ 20, హర్షల్ పటేల్ 17 చొప్పున పరుగులు చేశారు. దీంతో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments