Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణే టెస్ట్ మ్యాచ్ : న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ఆలౌట్

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (17:02 IST)
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను అశ్విన్ పడగొట్టగా, మిగిలిన ఏడు వికెట్లను వరుసగా సుందర్ ఖాతాలోకి చేరాయి. సుందర్ ఆఫ్ స్పిన్‌ను ఆడేందుకు కవీస్ ఆటగాళ్ళు ముప్పుతిప్పలు పడ్డారు. ఫలితంగా కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పిచ్‌ స్పిన్‌కు పూర్తిగా అనుకూలించడంతో ఏ దశలోనూ కివీస్ ఆటగాళ్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేకపపోయారు. కివీస్ జట్టులో డివాన్స్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులతో రాణించారు. 
 
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, రోహిత్ శ్రమ డకౌట్ అయ్యాడు. మొత్తం 9 పరుగులు ఎదుర్కొన్న రోహిత్.. పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ 6, గిల్ (0) పరుగులుతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్ల తరువాత మోదీ,షీ జిన్‌పింగ్ సమావేశం, రష్యాలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు, జగన్‌ వేసిన పిటిషన్‌లో ఏముంది? షర్మిలకు జగన్‌ రూ.200 కోట్లు ఇచ్చారా?

శ్రీ చైతన్య స్కూల్‌: 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క క్లిక్‌తో వంద రకాల సేవలు.. ఎలా సాధ్యం?

త్వరలో గొల్లప్రోలు ప్రభుత్వ పాఠశాలలో తరగతులు ప్రారంభం.. అంతా పవన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిసెంబర్ 5 న రిలీజ్ కు సిద్దమైన పుష్ప పార్ట్ 2: ది రూల్ - ఆనందంలో డిస్ట్రిబ్యూటర్స్‌

డియర్ కృష్ణ నుంచి ఎస్పీ బాలు పాడిన చివరి పాట విడుదల చేసిన మోహన్ లాల్

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబినేషన్ చిత్రం వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం

మహేష్ బాబు, రాజమౌళి ఎస్.ఎస్.బి. 29 సినిమా తాజా అప్ డేట్

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు బెయిల్

తర్వాతి కథనం
Show comments