Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెస్ట్‌చర్చ్‌లో థర్డ్ వన్డే మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (08:51 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, బుధవారం చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ జట్టుతో తలపడుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, అక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్లు తేడాతో గెలుపొందగా, హామిల్టన్ వేదికగా జరగాల్సిన రెండు వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో బుధవారం జరిగే థర్డ్ వన్డే మ్యాచ్ ‌ఇరు జట్లకు అత్యంత కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కుంచుకోవాలని ఆతిథ్య కివీస్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ జట్టులో మాత్రం బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి దిగుతున్నారు. కాగా, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌న భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments