Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంఖేడ్‌ స్టేడియంలో సెంచరీల మోత.. కివీస్ ఎదుట భారీ విజయలక్ష్యం

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (18:14 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీస్ మ్యాచ్ బుధవారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెటర్లు పరుగుల వరద పారించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ శుభమన్ గిల్‌లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో కోహ్లీ వన్డేల్లో తన 50వ సెంచరీని పూర్తి చేసుకోగా, శ్రేయాస్ అయ్యర్ కూడా వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 భారీ స్కోరు చేసింది. దీంతో కివీస్ ముంగిట 398 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ 29 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్ 66 బంతుల్లో 80 పరుగులు చేయగా, ఇందులో మూడు సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అయితే, తొడ కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీతో జతకలిసిన శ్రేయాస్ అయ్యార్ క్రీజ్‌లో నిలదొక్కుకున్న తర్వాత పరుగుల వరద పారించారు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు జెట్ స్పీడ్ వేగంతో ముందుకు సాగింది.
 
విరాట్ కోహ్లీ 113 బంతుల్లో రెండు సిక్స్‌లు 9 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 8 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 105 పరుగులు చేసింది. అలాగే, కేఎల్ రాహుల్ కూడా 20 బంతుల్లో రెండు సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో 39 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. కివీస్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్ ఒక వికెట్ తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments