Webdunia - Bharat's app for daily news and videos

Install App

4th T20, పోరాడి గెలిచిన టీమిండియా, 8 పరుగుల తేడాతో...

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (23:44 IST)
నాలుగో టి20లో ఇంగ్లాండు జట్టుపై టీమిండియా పోరాడి గెలిచింది. చివర్లో థాకూర్ 2 వైడ్ బాల్స్ వేసి కాస్తంత ఉత్కంఠతకు తెరతీసినప్పటికీ చివర్లో వికెట్ తీయడంతో విజయం భారత వశమైంది.
 
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్సమన్లకు క్రమంగా పెవిలియన్ దారి పట్టిస్తూ మ్యాచును తమవైపు తిప్పుకున్నారు. జోస్ బట్లర్ 9 పరుగులకే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్ సైతం ఒక సిక్సర్ కొట్టి మెరిపించినప్పటికీ 14 పరుగులకే ఔటయ్యాడు. ఐతే రాయ్ బాగా కుదురుకున్నాడు.  ఆ దశలో అతడికి బెయిర్‌స్టో తోడవడంతో ఇద్దరూ 9 ఓవర్లో జట్టు స్కోరును 131 చేర్చారు. అదే ఓవర్లో ప్రమాదకర ఇన్నింగ్స్ ఆడుతున్న రాయ్(40 పరుగులు) పాండ్యా బౌలింగులో యాదవ్‌కి చిక్కాడు.
 
ఆ తర్వాత బెయిర్ స్టో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ బెన్ స్టోక్స్ ఇండియన్ బౌలర్లకు దడ పుట్టించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. అతడి ఖాతాలో 3 సిక్సర్లు, 4 ఫోర్లు పడ్డాయి. టీమిండియా విజయావకాశాలపై దెబ్బ తీసే దిశగా పయనించాడు. ఐతే థాకూర్ బౌలింగులో యాదవ్ కి చిక్కాడు. 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ దశలో ఇంకా ఇంగ్లాండు విజయావకాశాలకు ఢోకా లేనట్లే అనిపించింది.
 
ఐతే స్టోక్స్ అలా వెళ్లగానే మోర్గాన్ ఇలా అవుటయ్యాడు. అతడు 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శామ్ కుర్రాన్ పాండ్యా బౌలింగులో బౌల్డయ్యాడు. జోర్డాన్ సైతం భారీ షాట్ల కోసం ప్రయత్నించి పాండ్యా చేతికి చిక్కాడు. ఇక ఆ తర్వాత ఆర్చర్, రషీద్ లు ప్రయత్నించినా నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీనితో భారత్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments