Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ : సెంచరీ చేసిన రోహిత్ శర్మ... అర్థ సెంచరీతో జడేజా...

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (15:23 IST)
రాజ్‌కోట్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించాడు. మూడో టెస్టులో తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జైశ్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ... ముచ్చటైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 157 బంతుల్లో సెంచరీ కొట్టాడు. తన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 
 
మరోవైపు, రోహిత్ శర్మకు అండగా మరో ఎండ్‌లో జడేజా కూడా నిలకడైన ఆటతీరుతో రాణించి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత శర్మ 129, జడేజా 83 పరుగులతో మైదానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మిగిలిన ఆటగాళ్లలో జైశ్వాల్ 10, శుభమన్ గిల్ డకౌట్ కాగా, రాజాత్ పటీదార్ 5 చొప్పున పరుగులు చేశఆరు. ఇంగ్లండ్ బౌలర్లలో ఉడ్ రెండు వికెట్లు పడగొట్టగా, హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments