కంగారూలను కంగారు పెట్టిస్తున్న భారత బౌలర్లు.. బుమ్రా అదుర్స్

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (14:05 IST)
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై ఇప్పటికే టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు.. ఎలాగైనా ఈ సిరీస్‌ నెగ్గాలని చూస్తోంది. మరోవైపు పొట్టి సిరీస్‌ గెలిచి జోరు మీదున్న ఆసీస్‌ వన్డే సిరీస్‌ సొంతం చేసుకుని భారత టూర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి వెళ్లాలనుకుంటోంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, బుమ్రా కొత్త బంతితో చెలరేగిపోతున్నారు. షమీ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసేందుకు వచ్చిన బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేస్తూ.. ఆసీస్ కెప్టెన్‌ అరోన్ ఫించ్‌ను మూడో బంతికే అవుట్ చేశాడు. 
 
బుమ్రా బంతిని ఫించ్ షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి ధోనీ చేతిలో పడింది. దీంతో ఆసీస్ సున్నా పరుగులకే తొలి వికెట్ నష్టపోయింది.ఇంకా కంగారూ జట్టును టీమిండియా బౌలర్లు కంగారు పెట్టిస్తున్నారు. దీంతో ఆ జట్టు ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments