Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్.. సెమీస్ అవకాశాలు క్లిష్టతరం.. మహిళా జట్టు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (16:23 IST)
మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో గెలవాల్సిందిపోయి.. ఓటమిని చవిచూసింది. 
 
దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
 
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది విజయం సాధించింది.  ఈ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
 
ఒకవేళ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మంగళవారం బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాతో విజయం సాధించాలి. 
 
అంతేకాదు న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే మనం సెమీస్‌ అవకాశాలు భారత్‌కు వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

హలో... నేను నీ భర్త రెండో భార్యను మాట్లాడుతున్నా: ఆ మాట వినగానే బస్సులోనే మృతి చెందిన మొదటి భార్య

అప్పుల బాధ భరించలేక భర్తను చంపి భార్య ఆత్మహత్యాయత్నం

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. నాటకం బయటపడిందిలా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్ జడ్జిగా సీజన్ 4 తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కడ?

కొత్త లోకా: చాప్టర్ వన్ – చంద్ర రివ్యూ, దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ కు మార్కులు

Allu Family: విశాఖలో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. వైరల్ అవుతున్న పాత ఫోటోలు

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

తర్వాతి కథనం
Show comments