Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019ను ఘనంగా వీడ్కోలు పలికిన కోహ్లీ.. మళ్లీ అగ్రస్థానమే...

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (18:58 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2019 సంవత్సరం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఈ యేడాదిలో ఆయన పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా, 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. ఫలితంగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆయన 2019 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకనున్నాడు. 
 
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను తాజాగా వెల్లడించారు. ఇందులో బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫలితంగా ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్టు అయింది. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
 
అలాగే, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జట్టులో చోటు కోల్పోయి ఏడాది తర్వాత జట్టలో చేరిన స్మిత్.. యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో స్మిత్ నాలుగు మ్యాచుల్లో 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి కోహ్లీని కిందికి నెట్టేశాడు.
 
అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదేసమయంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో స్మిత్ పేలవ ప్రదర్శన కారణంగా దిగువకు పడిపోయాడు. అయితే, న్యూజిలాండ్ సిరీస్ రూపంలో స్మిత్‌కు మరోమారు కోహ్లీని దాటే అవకాశం వచ్చినా అంతగా రాణించలేకపోయాడు. కివీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో 37.75 సగటుతో 151 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments