Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019ను ఘనంగా వీడ్కోలు పలికిన కోహ్లీ.. మళ్లీ అగ్రస్థానమే...

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (18:58 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2019 సంవత్సరం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఈ యేడాదిలో ఆయన పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా, 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. ఫలితంగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆయన 2019 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకనున్నాడు. 
 
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను తాజాగా వెల్లడించారు. ఇందులో బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫలితంగా ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్టు అయింది. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
 
అలాగే, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జట్టులో చోటు కోల్పోయి ఏడాది తర్వాత జట్టలో చేరిన స్మిత్.. యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో స్మిత్ నాలుగు మ్యాచుల్లో 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి కోహ్లీని కిందికి నెట్టేశాడు.
 
అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదేసమయంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో స్మిత్ పేలవ ప్రదర్శన కారణంగా దిగువకు పడిపోయాడు. అయితే, న్యూజిలాండ్ సిరీస్ రూపంలో స్మిత్‌కు మరోమారు కోహ్లీని దాటే అవకాశం వచ్చినా అంతగా రాణించలేకపోయాడు. కివీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో 37.75 సగటుతో 151 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments