Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌పై అబ్బాస్ మాట.. ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?!

Webdunia
బుధవారం, 25 మే 2016 (19:15 IST)
ముంబై దాడుల అనంతరం ఇండో-పాక్ క్రికెట్ సిరీస్‌‌‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు ఐసీసీ ప్రెసిడెంట్, పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ భారత్ రానున్నారు.

ఈ రాకను పురస్కరించుకుని భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌ కోసం ఆయన పావులు కదుపనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించనున్న జహీర్ అబ్బాస్ భారత్-పాకిస్థాన్ క్రికెట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానని కరాచీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. 
 
‘బీసీసీఐ నుంచి ఆహ్వానాన్ని అందుకున్నానని, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్‌కు సంబంధించిన చర్చలకు ఇది మంచి వేదిక అవుతుందని భావిస్తున్నట్లు అబ్బాస్ వెల్లడించారు. ఇంకా పాకిస్థాన్ ఆటగాళ్లని ఐపీఎల్‌లోకి అనుమతించాలని కూడా బీసీసీఐని కోరనున్నట్లు తెలిపారు.

కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ తొలి సీజన్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లకు అనుమతిని బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments