Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : చిత్తుగా ఓడిన శ్రీలంక.. సెమీస్‌కు భారత్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (20:40 IST)
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలో భాగంగా గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. 302 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా 2023 ప్రపంచ కప్ పోట్లీలో సమీస్‌కు చేరిన తొలి జట్టుగా అడుగుపెట్టింది. 
 
ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (6/21) బంతితో నిప్పులు చెరిగిన ఆ మ్యాచ్ లో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడదే సీన్ రిపీటైంది. గురువారం టీమిండియా, శ్రీలంక జట్లు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. 
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ తన ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో శ్రీలంక ముగింట 358 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా, మిగిలిన టాపార్డర్ బ్యాట్‌తో వీరవిహారం చేశారు. 
 
రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభమన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 92, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ మధుశంక వీరి జోడీని విడిదీశాడు. దీంతో కోహ్లీ మరోమారు సెంచరీ చేజార్చుకున్నాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 56 బంతుల్లో ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో 82 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు, రవీంద్ర జడేజా 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ చొప్పున తీశాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు గెలుపొందాలంటే 50 ఓవర్లలో 359 పరుగులు చేయాల్సివుంది. 
 
భారత్ భారీ స్కోరు సాధించిన అదే పిచ్‌పై శ్రీలంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. షమీ, సిరాజ్‌లు మరోసారి చెలరేగి ఎనిమిది వికెట్లు కూల్చారు.  మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి లంకేయుల వెన్ను విరిచాడు. సిరాజ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, జడేజాలు ఒక్కో వికెట్ తీశారు. ఫలితంగా శ్రీలంక జట్టు కేవలం 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఇన్నింగ్స్ తొలి బంతికే లంక ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (0)ను డకౌట్ చేయడం ద్వారా బుమ్రా లంక వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ మొదలైంది. మరో ఓపెనర్ కరుణరత్నే (0)ను ఖాతా తెరిచే చాన్స్ ఇవ్వకుండా పెవిలియన్ కు పంపిన సిరాజ్, అదే ఊపులో లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (1) ను కూడా అవుట్ చేశాడు. అతడ్ని సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సదీర సమరవిక్రమకు సిరాజ్ ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. సమరవిక్రమను కూడా డకౌట్ చేశాడు. అప్పటికి లంక స్కోరు 3 పరుగులే. 
 
ఆ తర్వాత మహ్మద్ షమీ బంతిని అందుకోవడం లంక మరింత హడలిపోయింది. షమీ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అప్పటికి స్కోరు 9.4 ఓవర్లలో 14 పరుగులకు 6 వికెట్లు. షమీ ధాటికి చరిత్ అసలంక (1), దుషాన్ హేమంత (0) పేలవ రీతిలో వెనుదిరిగారు. కాసేపటికే దుష్మంత చమీర కూడా షమీ బంతికి బలయ్యాడు. 
 
వికెట్ల వెనుకాల కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షమీకి మూడో వికెట్ దక్కింది. చివరకు 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో బౌలర్ రజిత చేసిన 14 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఐదుగురు లంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. టాపార్డర్ కుప్పకూలిపోవడంతో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments