Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బయోపిక్: సాక్షి పాత్రలో నటించనున్న కొత్త భామ కియారా అద్వానీ!

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (09:30 IST)
టీమిండియా వన్డే, ట్వంటీ 20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ సినిమా తెరకెక్కనుంది. ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ధోనీ పాత్రకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (పీకే ఫేం) ఎంపిక కాగా, ధోనీ భార్య సాక్షి పాత్రకు ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్త భామ కియారా అద్వానీ సెలెక్ట్ అయింది. సాక్షి పాత్రకు చాలా మంది హీరోయిన్లను పరిశీలించామని చెప్పిన నీరజ్, కియారా అయితేనే సరిపోతుందనిపించిందని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. సాక్షి, ధోనీలను ఇంకా కలవలేదని.. తన రోల్‌కు న్యాయం చేసే దిశగా తీవ్రంగా కృషి చేస్తానని, సాక్షి పాత్రలో మెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. సాక్షి క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకుని ఈ రోల్ చేస్తానని చెప్పింది. ఇక ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని కియా అద్వానీ వెల్లడించింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments