Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి వరద నిధుల నుంచి రూ.47.19 లక్షలిచ్చారా? హరీష్ రావత్‌కు కొత్త తలనొప్పి?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తరాఖండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఉత్తరాఖండ్ సర్కారు కోహ్లీ భారీ మొత్తాన్ని అందించింది. అయితే కోహ్లీకి ఉత్తరాఖండ్ సీఎం హర

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:20 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తరాఖండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఉత్తరాఖండ్ సర్కారు కోహ్లీ భారీ మొత్తాన్ని అందించింది. అయితే కోహ్లీకి ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ అందించిన రూ.47లక్షల పైచిలుకు వరద నిధుల నుంచి కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
అసెంబ్లీ ఫలితాలు మార్చి 11వ తేదీన విడుదలవుతున్న తరుణంలో బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కోహ్లీకి ఉత్తరాఖండ్ సర్కారు 2015జూన్‌లో వరద నిధుల నుంచి అక్షరాలా రూ.47.19 లక్షలు చెల్లించింది. 2013 కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తిన తరుణంలో బాధితుల పునరావాసం కోసం కేటాయించిన నిధుల నుంచి కోహ్లీ భారీ మొత్తం ఇవ్వడం సబబు కాదని.. విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై సీఎం హరీష్ రావత్ మీడియా సలహాదారు సురేంద్ర కుమార్ వివరణ ఇచ్చారు. 
 
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో టూరిజం శాఖ కీలమన్నారు. అందుకే ఆ శాఖను ప్రమోట్ చేసేందుకు ఓ ప్రముఖ వ్యక్తిని ఎంచుకోవడంలో తప్పులేదన్నారు. చట్టప్రకారమే అన్నీ చేశామని తెలిపారు. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అనవసరంగా  బీజేపీ ఓడిపోతామనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments