Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు బుర్రంటూ వుంటే ధోనీని అడుగు.. ఘాటుగా బదులిచ్చిన భజ్జీ

ఆమ్రపాలి సంస్థ విల్లాలు కొనుక్కునే వారిని మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్ర

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:08 IST)
ఆమ్రపాలి సంస్థ విల్లాలు కొనుక్కునే వారిని మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నెటిజన్ల నుంచి ధోనీ, భజ్జీలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమ్రపాలి సంస్థకు మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ‌ వ్యవహరించాడు. అయితే విల్లాలు కొనుక్కునే వాళ్లను ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ తప్పుకున్నాడు. 
 
ఈ క్రమంలో సోషల్ మీడియాలో భజ్జీని ఉద్దేశించి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోట్లాది రూపాయల విలువ గల విల్లాలను ఆమ్రపాలి సంస్థ ధోనీ, భజ్జీకి కానుకలుగా అందజేసింది. అందుకే మా డబ్బులు మాకు రావట్లేదన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన భజ్జీ అతనికి సమాధానమిచ్చాడు. తాము విల్లాలు అందుకున్నట్లు మీకెవరు చెప్పారని నిలదీశాడు. 
 
అలాంటివి ఏమీ మాకు అందలేదు. మా పేర్లు వాడుకుని ప్రజల నుంచి పలువురు సొమ్ములు చేసుకుంటున్నారని భజ్జీ స్పష్టం చేశాడు. దానికి మరో నెటిజన్ ఆమ్రపాలి సంస్థ యజమానికి ధోనీ మంచి స్నేహితుడు. అందుకే భజ్జీ అసత్యాలు పలుకుతున్నాడంటూ ట్వీట్ చేశాడు. అతనికి భజ్జీ సమాధానమిస్తూ, ఆమ్రపాలి సంస్థ యజమాని ధోనీకి స్నేహితుడు కాబట్టి ధోనీని అడగడం న్యాయం. నీకు బుర్రంటూ వుంటే ధోనీని అడుగు అంటూ ఘాటుగా బదులిచ్చాడు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments