Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది.. చెప్పింది ఎవరబ్బా?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:37 IST)
ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మిస్టర్ కూల్‌గా ఉండి.. నేటితరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు ధోనీ. అలాంటి ధోనీపై ఓ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే తన కెరీర్ నాశనం అయిందని విమర్శించాడు. ధోనీ తనకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు తన కెరీర్ మరోలా ఉండేదని వాపోయాడు.
 
టీమిండియా ఆటగాడు ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌కు ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే గుడ్ బై చెప్పాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో భారత జట్టులోకి వచ్చిన మధ్యప్రదేశ్ క్రికెటర్ ఈశ్వర్ పాండే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. 
 
''మహేంద్ర సింగ్ ధోనీ నాకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేది. అప్పుడు నా వయస్సు 23-24 సంవత్సరాలు. ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది. అప్పుడు ధోనీ భాయ్ నాకు టీమ్ ఇండియాలో అవకాశం ఇచ్చి ఉంటే.. నేను నా దేశం కోసం బాగా రాణించేవాడి. 
 
కానీ సరైన అవకాశాలు దక్కలేదు.. అని వాపోయాడు. 2013లో న్యూజిలాండ్ పర్యటనలో ఈశ్వర్ పాండే టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments