Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులివ్వకుండా మోసం చేసిందని ధోనీ భార్యపై 420కేసు!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:48 IST)
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఈ కంపెనీలో సమాన షేర్లు ఉన్నాయి. వీరితోపాటు డెన్నిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో 39 శాతం వాటా ఉండేది. వాటాల విక్రయం వ్యవహారంలో డబ్బు చెల్లించకుండా తనను మోసం చేశారని డెన్నిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
డెన్నిస్ కంపెనీలోని తన వాటాను డైరెక్టర్లకు అమ్మేశాడు. ఇందులో భాగంగా మార్చి చివరి నాటికి అరోరాకి రూ.11 కోట్లు రావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 2.25 కోట్లు మాత్రమే అతడికి ముట్టాయి. సాక్షితో పాటు మిగతా డైరెక్టర్లు డబ్బు ఇవ్వలేదని అతను అందరిపై కేసు వేశాడు. సాక్షి మాత్రం ఈ విషయమై స్పందించలేదు. దీంతో అతడు సాక్షి ధోనితోపాటు మిగతా ముగ్గురు డైరెక్టర్లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కంపెనీ నుంచి కొన్నేళ్ల కిందటే సాక్షి వైదొలిగిందని, ఆమెపై కేసు నమోదు చేసే అవకాశం లేదని అరుణ్ పాండే వాదిస్తున్నారు. మరి ఈ కేసు విషయమై ధోనీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments