Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : శ్రీలంకను కట్టడి చేసిన ఇంగ్లండ్

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (19:35 IST)
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు శ్రీలంక జట్టును కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో అతికష్టంమ్మీద 232 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక లంక బ్యాట్స్‌మెన్లు అష్టకష్టాలు పడ్డారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు అతికష్టమ్మీద 50 ఓవర్లు ఆడి 9 వికెట్లకు 232 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు కేవలం మూడు పరుగులకే ఔట్ కాగా, మిడిలార్డర్‌లో ఫెర్నాండో (49), మెండిస్ (46)లు కొంతమేరకు పోరాడారు. 
 
ఒక దశలో 38 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత మిగిలిన 12 ఓవర్లలో ఆ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఏంజెలా మాథ్యూస్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ధనంజయ డిసిల్వ (29) నుంచి మాథ్యూస్‌కు మంచి సహకారం అందింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వుడ్ చెరో 3 వికెట్లు తీయగా, అదిల్ రషీద్ 2 వికెట్లు సాధించాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments