Webdunia - Bharat's app for daily news and videos

Install App

లార్డ్స్ వన్డే : రూట్ సెంచరీ.. భారత్ చిత్తు.. ఇంగ్లండ్ గెలుపు

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ రూట్స్ (113) అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో రాయ్ 40, బెయి

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (11:25 IST)
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ రూట్స్ (113) అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో రాయ్ 40, బెయిర్ స్టో 38, మోర్గాన్ 53, విల్లే 50 చొప్పున పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ జట్టు 322 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముంగిట 323 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
 
ఆ తర్వాత 323 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్‌లో చతికిలపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 15, శిఖర్ ధావన్ 36 రన్స్ చేసి పెవిలియన్ దారిపట్టారు. కోహ్లీ 45, రైనా 46 రన్స్ చేశారు. 
 
50 ఓవర్లు ఆడిన భారత్ 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 86 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో 1-1 పాయింట్లతో ఇరు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మ్యాచ్ ఈనెల 17వ తేదీన లీడ్స్‌లో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం
Show comments