Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్ జాదవ్ రనౌట్‌తో గెలవలేదు... గెలుపుకు అదే కారణం : మోర్గాన్

కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:52 IST)
కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్ కావడం వల్లే ఇంగ్లండ్ గెలిచిందన్న చర్చ సరైనది కాదన్నారు. అసలు తమ గెలుపునకు ముఖ్య కారణం ఈడెన్ గార్డెన్ మైదానమేనని చెప్పారు. ఈ మైదానంతో పాటు.. పిచ్ అచ్చం ఇంగ్లండ్ మైదానం, పిచ్‌‌లాగే ఉందని అందుకే విజయం సాధించినట్టు చెప్పారు. 
 
ఇక్కడ పిచ్‌లు భారత ఆటగాళ్లకు బాగా అలవాటని అందుకే భారత బ్యాట్స్‌మన్ బాగా రాణించగలిగారని అన్నాడు. అయితే తమ దేశంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ జరగడం అందులో తాము గెలవడంతో మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. 
 
కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. తీవ్ర ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంకా నాలుగు బంతులు ఉన్నంత వరకూ మ్యాచ్ భారత్ వైపే ఉంది. ఆ సమయంలో కేదార్ జాదవ్ అనూహ్యంగా ఔట్ కావడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments