Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్ జాదవ్ రనౌట్‌తో గెలవలేదు... గెలుపుకు అదే కారణం : మోర్గాన్

కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:52 IST)
కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్ కావడం వల్లే ఇంగ్లండ్ గెలిచిందన్న చర్చ సరైనది కాదన్నారు. అసలు తమ గెలుపునకు ముఖ్య కారణం ఈడెన్ గార్డెన్ మైదానమేనని చెప్పారు. ఈ మైదానంతో పాటు.. పిచ్ అచ్చం ఇంగ్లండ్ మైదానం, పిచ్‌‌లాగే ఉందని అందుకే విజయం సాధించినట్టు చెప్పారు. 
 
ఇక్కడ పిచ్‌లు భారత ఆటగాళ్లకు బాగా అలవాటని అందుకే భారత బ్యాట్స్‌మన్ బాగా రాణించగలిగారని అన్నాడు. అయితే తమ దేశంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ జరగడం అందులో తాము గెలవడంతో మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. 
 
కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. తీవ్ర ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంకా నాలుగు బంతులు ఉన్నంత వరకూ మ్యాచ్ భారత్ వైపే ఉంది. ఆ సమయంలో కేదార్ జాదవ్ అనూహ్యంగా ఔట్ కావడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments