Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్ : ఇంగ్లండ్ వెన్ను విరిచిన అక్షర్ పటేల్

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. డే అండ్ నైట్ తరహాలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్‌‍ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణికిపోయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా అక్సర్ పటేల్, అశ్విన్‌లు రెచ్చిపోయారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని (డకౌట్) ఇశాంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 
 
మిగిలిన ఆటగాళ్ళలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్నింగ్స్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం