Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె ఓటమి టీమిండియాకు మంచే చేసింది : కెప్టెన్ ధోనీ

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:23 IST)
శ్రీలంకతో పూణేలో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మంచే చేసిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా పర్యాటక శ్రీలంక జట్టు చేతిలో ఓడిన విషయం తెల్సిందే. దీనిపై ధోనీ స్పందిస్తూ.. బ్యాట్స్‌మన్ షాట్ సెలక్షన్ కొంపముంచిందన్నాడు. 
 
వన్డేల్లా వేచి చూసి ఆడే అవకాశం టీట్వంటీల్లో ఉండదని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో జట్టులోని అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీంతో ఎవరు ఎలా ఆడతారు అనే అంచనా చిక్కిందని ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
జట్టు మొత్తం విఫలమవడంతో విజయగర్వంతో ఆడకూడదని ఆటగాళ్లకు అర్థమై ఉంటుందని ధోనీ చురకంటించాడు. శ్రీలంక ఆటగాళ్లలో రజిత, శనక, చమీరలు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. రెండో టీట్వంటీలో జట్టు పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments